గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం టౌన్ పరిధి బికాలనీలోని ఎన్టీపీసీకి చెందిన పంప్హౌస్వద్ద కాంట్రాక్టు కార్మికుడు కాటం శ్రీనివాసులు(58) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇందిరానగర్కు చెందిన శ్రీనివాసులు పంప్ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుండగా.. ఆదివారం మధ్యాహ్నం షిప్టు కూడా డ్యూటీ చేస్తానని వెళ్లాడు.
సమీపంలోనే అతని ఇల్లు ఉండగా సాయంత్రం భార్య రాజేశ్వరి టీ తీసుకెళ్లి ఇచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కూతురుతో కలిసి ఆమె భర్త వద్దకు వెళ్లగా కనిపించలేదు. నైట్డ్యూటీకి వచ్చిన మరో కాంట్రాక్టు కార్మికుడి రాజయ్యతో కలిసి పరిసరాల్లో వెతకగా పంప్హౌస్ వెనకాల చెట్ల పొదల్లో చనిపోయి కనిపించాడు. అయితే.. టాయిలెట్ కు వెళ్లి ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడ్డాడా ? లేక ఎవరైనా కొట్టి చంపారా ? అనేది తేలాల్సి ఉంది. భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో రామగుండం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
