ప్రపంచ దేశాల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ గురించి ఓ మహిళ 12ఏళ్ల క్రితమే ఓ బుక్ లో క్లుప్తంగా రాసింది. ప్రస్తుతం నెటిజన్లు ఆ బుక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాకు చెందిన రచయిత సిల్వియా బ్రౌన్. 2008లో సిల్వియా ఎండ్ ఆఫ్ డేస్ అనే బుక్ ను రాసింది. ఆ బుక్ లో 2020లో ప్రపంచ దేశాలు వైరస్ భారిన పడతాయని తెలిపింది.
బుక్ లో ఏముందంటే
2020 లో ప్రజలు తీవ్రమైన న్యుమోనియాలాంటి అనారోగ్యం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. లంగ్స్, ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని వివరించింది.

బుక్ లో కరోనా అంతం గురించి
కరోనా ఎక్కువ మందికి వ్యాపిస్తున్నట్లు బ్రౌన్ తన బుక్ లో చెప్పింది. అకస్మాత్ గా వచ్చిన కరోనా అలాగే మాయమవుతుందని పేర్కొంది. మళ్లీ కరోనా ప్రభావం 10సంవత్సరాల తరువాత ఉంటున్నట్లు బ్రౌన్ తాను రాసిన పుస్తకంలో వివరించింది. అయితే బ్రౌన్ రాసిన పుస్తకం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాధి గురించి చెప్పేది నిజమేనా..? యాదృచ్చికంగా రాసిందా అన్న కోణంలో నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.
స్నోప్స్ సంస్థ ఏం చెప్పింది
ఈ బుక్ పై ఫ్యాక్ట్ ఫైండింగ్ సంస్థ స్నోప్స్ స్పందించింది. బుక్ లో బ్రౌన్ రాసింది నిజమేనని తెలిపింది. కానీ నిజంగానే అంచనా వేసిందనే దానికంటే యాదృశ్చికంగా రాసిందని నిర్ధారించింది.
