
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్గా టి.రమేశ్ మున్సిపల్ ఆఫీస్లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆయన ప్రమోషన్పై సుల్తానాబాద్ కమిషనర్గా బదిలీ చేసింది. ఇక్కడ పనిచేసిన కమిషనర్ ఎండీ నియాజ్ను సీడీఎంఏ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కమిషనర్కు మేనేజర్ అలీమొద్ధీన్, సిబ్బంది స్వాగతం పలికారు.