- గంటన్నరపాటు నిలబడ్డ ఆఫీసర్
- సోషల్ మీడియాలో వైరలైన వీడియో
దేవరకొండ, వెలుగు: రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల తహసీల్దార్ దేవదాస్కు తీవ్ర అవమానం జరిగింది. ఈ నెల 27న మండల కేంద్రంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపై మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అనుచరులు ప్రొటోకాల్ లేకున్నా కూర్చున్నారు. దీంతో కుర్చీ లేక తహసీల్దార్ దేవదాస్ స్టేజీ మీద కార్యక్రమం అయిపోయేవరకు అలాగే నిల్చుండిపోయారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలైంది. తహసీల్దార్ దళితుడు అయినందునే ప్రజాప్రతినిధులు ఇలా అవమానానికి గురి చేశారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు.