స్కూళ్లలో టెన్త్​ క్లాస్​ స్టూడెంట్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు పరీక్షలు

స్కూళ్లలో టెన్త్​ క్లాస్​ స్టూడెంట్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు పరీక్షలు

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్​ స్కూళ్లలో టెన్త్​ క్లాస్​ స్టూడెంట్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలు నిర్వహిస్తున్నారు అడిషన్​ కలెక్టర్​ రాహుల్​.  రానున్న పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ రిజల్ట్స్​ సాధించడం కోసం వారిలో కాన్ఫిడెన్స్​, సబ్జెక్ట్​పై పట్టు  పెంచేందుకు ఈ 'ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష' నిర్వహిస్తున్నారు. ఈ టాలెంట్​ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించి, వారికి ట్యాబ్​లు ఇవ్వనున్నారు. విద్యకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహకరాలను అందించనున్నారు. జిల్లా నుంచి ఏటా కనీసం పది మందికి ప్రైవేట్​, కార్పొరేట్​ కాలేజీల్లో ఇంటర్మీడియట్ లో ​ ఫ్రీ సీట్లు సాధించేలా ప్రోత్సహించనున్నారు. 

 నైపుణ్యాలను పెంచడానికి... 

జిల్లావ్యాప్తంగా 124 గవర్నమెంట్​ హైస్కూళ్లు ఉన్నాయి. ఒక్కో స్కూల్​ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 620 మంది మెరిట్​స్టూడెంట్లను ప్రతిభా ప్రోత్సాహక పరీక్షకు సెలెక్ట్​ చేశారు. అసెస్​మెంట్​, ప్రీ ఫైనల్​ ఎగ్జామ్స్​లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా మళ్లీ స్కూల్​ లెవల్​లో టెస్ట్​ నిర్వహించి ఐదుగురిని ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​, లక్సెట్టిపేటలో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేసి ఈ నెల 11న ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష నిర్వహించారు. ఒక్కో సబ్జెక్టు​ నుంచి 25 చొప్పున ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 150 మల్టిపుల్​ ఛాయిస్ ప్రశ్నలతో  క్వశ్చన్​ పేపర్​ తయారు చేశారు. ఇందులో మెరిట్​ సాధించిన ఐదు నుంచి పది మంది స్టూడెంట్లకు ఇంటర్​ సిలబస్​ లోడెడ్​ ట్యాబ్​లు గిఫ్ట్​గా అందించనున్నారు.

ఫ్రీ సీట్లు పొందేందుకు

అలాగే ఐదు నుంచి పది మంది విద్యార్థులకు ఇంటర్​లో ఫ్రీ సీట్లు ఇప్పించడానికి ఆయా మేనేజ్​మెంట్లతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది కాస్త ఆలస్యం కావడంతో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే స్టూడెంట్లను ఇందుకు ప్రిపేర్​ చేయాడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

స్కూల్​ ఎడ్యుకేషన్​పై ఫోకస్​... 

నిరుడు నవంబర్​లో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ (లోకల్​ బాడీస్​)గా బాధ్యతలు చేపట్టిన బి.రాహుల్​ ఓవైపు స్థానిక సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు స్కూల్​ ఎడ్యుకేషన్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. గవర్నమెంట్​ స్కూళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు.   మెరుగైన విద్యనందిస్తున్న టీచర్లను, చురుకైన స్టూడెంట్లను అభినందిస్తూ వారికి స్వయంగా లెటర్లు రాస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు తడిచెత్త – పొడిచెత్త అంశంపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆయన తన ప్రణాళికలను కలెక్టర్​తో, విద్యాశాఖ అధికారులతో చర్చించి అమలు చేస్తుండగా, వారు సైతం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. పేద విద్యార్థుల పట్ల ఈ యంగ్​ ఐఏఎస్​ ఆఫీసర్ చూపుతున్న ప్రేమను పలువురు అభినందిస్తున్నారు.

 విద్యార్థులకు దిక్సూచిగా.... 

గవర్నమెంట్​ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులను నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. వారిలో సబ్జెక్ట్​ నాలెడ్జ్​, సెల్ఫ్​ కాన్ఫిడెన్స్​, కమ్యూనికేషన్​ స్కిల్స్​ పెంపొందించడానికే 'ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష'లు నిర్వహిస్తున్నాం. టెన్త్​ పబ్లిక్​ ఎగ్జామ్​లో మంచి రిజల్ట్​ సాధించడానికి కూడా దోహదపడుతుంది. ఈ పరీక్షలో మెరిట్​ సాధించిన ఐదు నుంచి పది మంది విద్యార్థులకు ట్యాబ్​లు అందించడంతో పాటు ప్రైవేట్​, కార్పొరేట్​ కాలేజీల్లో ఇంటర్​లో ఫ్రీ సీట్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. 
- బి.రాహుల్​, అడిషనల్​ కలెక్టర్​