జాతీయ జెండాలతో ర్యాలీ తీసిన జనాలపై తాలిబాన్ల కాల్పులు

జాతీయ జెండాలతో ర్యాలీ తీసిన జనాలపై తాలిబాన్ల కాల్పులు

అఫ్గానిస్థాన్ కునార్ ప్రావిన్స్ లోని అసదాబాద్ లో దారుణం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలతో ర్యాలీ తీసిన జనాలపైకి తాలిబాన్లు కాల్పులు జరిపారు. కాల్పుల భయంతో వందలాది మంది ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఎంతమంది చనిపోయారనేదానిపై క్లారిటీ రాలేదు. బ్రిటిషర్లు దేశం విడిచిపోయిన సందర్భంగా ప్రతి ఏడాది ఆగష్టు 19న అఫ్గానిస్థాన్ ప్రజలు ఇండిపెండెన్స్ డే గా జరుపుకుంటారు.