
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకాన్ని జైన్ 12 న అమలు చేయనుంది. చంద్రబాబు, సర్కార్,కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం అమలు చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 15వేలు జమ కానున్నాయి.
సీఎం చంద్రబాబు 67లక్షల 27వేల 164 మంది విద్యా ర్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప జేయ నున్నారు. తల్లికి వందనం స్కీమ్ కింద తల్లుల ఖాతాల్లో రూ.8వేల 745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నారు.
ALSO READ | జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ మహిళల ఆందోళన
అడ్మిషన్లు పూర్తి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీవో విడుదల చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసింది కూటమి సర్కార్.