మూడోసారి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని 

మూడోసారి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని 

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టడం ఆయనకు ఇది మూడోసారి.  60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ లో ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు జరుగుతున్నాయి. రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్.వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ ల పేర్లు కూడా వినిపించాయి. అయితే..తమ్మినేనికే మరోసారి పార్టీ పగ్గాలు లభించాయి.

 

మరిన్ని వార్తల కోసం...

కలిసున్న కవలలకు సెపరెట్ ఓటర్ కార్డులు