రక్షణ రంగం బలోపేతం.. మూడు కొత్త అపాచీలు వచ్చేస్తున్నయ్

రక్షణ రంగం బలోపేతం.. మూడు కొత్త అపాచీలు వచ్చేస్తున్నయ్
  • రక్షణ రంగంలో చేరనున్న  ‘ఏహెచ్​ 64ఈ’ హెలిక్యాప్టర్లు
  • ఈ నెల 21న అమెరికా నుంచి రానున్న హెలిక్యాప్టర్లు  
  • భారత్​, పాకిస్తాన్​ బార్డర్​లో మోహరించనున్న ఆర్మీ

న్యూఢిల్లీ: వచ్చే వారం మన రక్షణ రంగంలో ‘అపాచీ ఏహెచ్​ 64ఈ’ హెలిక్యాప్టర్లు చేరనున్నాయి. తొలివిడతలో భాగంగా మూడింటిని ఈ నెల 21న  అమెరికా పంపనుంది. వీటిని భారత్​, పాకిస్తాన్​ బార్డర్​లో మోహరించనున్నట్లు మన ఆర్మీ అధికారవర్గాలు తెలిపాయి. ఆరు ‘అపాచీ ఏహెచ్​ 64ఈ’ హెలిక్యాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 2020లో అమెరికాతో (ట్రంప్​ మొదటి టర్మ్​ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు) మన దేశం ఒప్పందం చేసుకుంది. 

ఈ డీల్​ విలువ 600 మిలియన్​ డాలర్లు. ఈ హెలిక్యాప్టర్లు  నిరుడు జూన్​ వరకే ఇండియాకు చేరుకోవాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు మూడింటిని పంపనున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మూడు హెలిక్యాప్టర్లు ఘాజియాబాద్ సమీపంలోని హిండన్​ఎయిర్​ఫోర్స్ స్టేషన్​లో దిగనున్నాయి. అనంతరం రక్షణ రంగంలో వినియోగం కోసం వీటిని బార్డర్​కు తరలిస్తారు. ఈ హెలిక్యాప్టర్లలో అత్యాధునిక కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్ ఉంటాయి. 

రాత్రి పూటైనా సరే టార్గెట్లను ఖచ్చితంగా గుర్తించి దాడి చేయగల డిఫెన్స్​ సిస్టమ్​ఇందులో ప్రత్యేకత. ఒప్పందంలో భాగంగా మరో మూడు అపాచీ హెలిక్యాప్టర్లు ఈ ఏడాది చివరి నాటికి అమెరికా పంపే అవకాశం ఉంది.