ఎయిరిండియా (Air India) కొత్త సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాంబెల్ విల్సన్ ను నియమిస్తున్నట్లు టాటాసన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. విల్సన్ నియామకాన్ని ఎయిరిండియా బోర్డు ఆమోదించినట్లు చెప్పింది. 50 ఏళ్ల విల్సన్ కు విమానయాన రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉంది. 15 ఏళ్లకు పైగా సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూపులో విధులు నిర్వర్తిస్తున్నారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని విస్తారా ఎయిర్ లైన్స్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్ భాగస్వామిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విల్సన్ అనుభవం ఎయిరిండియాకు చాలా ఉపయోగపడుతుందని టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖర్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిరిండియా సీఈఓ, ఎండీగా టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసీకి ఆఫర్ చేస్తే ఆయన తిరస్కరించారు.
మరిన్ని వార్తల కోసం..