TCS హెచ్చరిక: ఉద్యోగులందరూ ఆఫీస్కు రావాల్సిందే

TCS హెచ్చరిక: ఉద్యోగులందరూ ఆఫీస్కు రావాల్సిందే

రిటర్న్ టు ఆఫీస్ పాలసీ బాగా పనిచేసిందని.. దాదాపు 65 శాతం మంది ఉద్యోగులు వారానికి 3-5 రోజులు ఆఫీసుల్లో పని చేస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) CEO , ఎండీ క్రితివాసన్ చెప్పారు. మేం వారితో కలిసి పనిచేస్తున్నాం..ఐదు రోజులు వారు ఆఫీసుకు రావడానికి వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. రాబోయే రెండు త్రైమాసికాల్లో చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి వస్తారని అన్నారు. 

2025 నాటికి కంపనీ అసోసియేట్ లలో 25 శాతం మంది మాత్రమే ఏ సమయంలోనైనా దాని సౌకర్యాలనుంచి పని చేయవలిసి ఉంటుంది.. అలాగే ఉద్యోగులు తమ పనిలో 25 శాతానికి మించి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదని టీసీఎష్ సీఈవో రాజేష్ గోపీనాథన్ అన్నారు.