-final.Team-India-is-practicing-hard-for-the-World-Test-Championship-(WTC)-final._H5gPZiK1Vd.jpg)
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం టీమిండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఐపీఎల్లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ కూడా టీమ్లో జాయిన్ అయ్యాడు. అరుండెల్ కాసిల్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ముందుగా సిరాజ్, ఉమేశ్తో కలిసి వామప్ చేసిన కోహ్లీ తర్వాత నెట్స్లో బ్యాటింగ్ చేశాడు. భుజం గాయం నుంచి కోలుకుంటున్న పేసర్ జై దేవ్ ఉనాద్కట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడుతూ కనిపించాడు. కాగా, రోహిత్, యశస్వి జైస్వాల్ మంగళవారం టీమ్తో కలవనున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగించుకొని జడేజా, గిల్, షమీ, కేఎస్ భరత్, రహానె చివరి బ్యాచ్గా మంగళవారం యూకే బయల్దేరుతారు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే నేరుగా ఆస్ట్రేలియాతో జూన్7 నుంచి ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనుంది.