టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొంతకాలంగా వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్న పంత్.. ఇప్పుడు దాని అవసరం లేకుండా మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. 2022, డిసెంబరు చివరి వారంలో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పంత్ ప్రాణాలు నిలిచాయి.
కాలికి, వీపుకు బలమైన గాయాలు కావడంతో పంత్ చాలాకాలం మంచానికే పరిమితమయ్యాడు. కొంతకాలంగా పంత్ వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్నాడు.
అయితే.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో పంత్ అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది. చేతిలో ఉన్న ఊతకర్రను అక్కడే ఉన్న వ్యక్తిపై విసిరేసిన పంత్ కాస్త హుషారుగా నడవడం వీడియోలో కనిపించింది.
ఈ వీడియోపై నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. పంత్ ను మళ్లీ ఇలా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, టీమిండియాలోకి అతడి పునరాగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/CricCrazyJohns/status/1654457456532291585