ఉమెన్స్ వన్డే: శ్రీలంకపై ఇండియా విక్టరీ

ఉమెన్స్ వన్డే:  శ్రీలంకపై ఇండియా విక్టరీ

పల్లెకెలె: కెప్టెన్​ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (75; 1/21), పూజా వస్త్రాకర్‌‌‌‌ (56 నాటౌట్‌‌‌‌; 2/32) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేయడంతో గురువారం జరిగిన మూడో వన్డేలో ఇండియా 39 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 3–0తో క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసింది. హర్మన్‌‌‌‌, వస్త్రాకర్‌‌‌‌ ఫిఫ్టీలతో రాణించడంతో  తొలుత ఇండియా 50 ఓవర్లలో 255/9 స్కోరు చేసింది.  ఛేజింగ్‌‌‌‌లో లంక 47.3 ఓవర్లలో 216 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడిపోయింది. 

నీలాక్షి (48) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్‌ 3 వికెట్లు పడగొట్టింది. కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముందు లంక పర్యటనలో మొదట టీ20 సిరీస్‌ నెగ్గిన భారత్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.