- రెండు జట్లు.. ఒకే ఫ్లైట్లో
- ఇంగ్లండ్కు టీమిండియా మెన్స్, విమెన్స్ ప్లేయర్లు
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి మెన్స్, విమెన్స్ జట్లు కలిసి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేయనున్నాయి. వరల్డ్టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్సేన యూకే వెళ్తుండగా, మిథాలీ రాజ్ నేతృత్వంలోని విమెన్స్ టీమ్.. ఇంగ్లండ్తో ఓ టెస్ట్(నాలుగు రోజుల మ్యాచ్), మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు అక్కడికి వెళ్తున్నది. దీంతో జూన్2న ముంబై నుంచి రెండు టీమ్లు ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. ‘మమ్ముల్ని ఈ నెల19న ముంబైకి రమ్మన్నారు. హార్డ్ క్వారంటైన్ తర్వాత మా ప్రయాణం మొదలవుతుంది. ఫ్లైట్లో మాతో విమెన్స్ క్రికెటర్లు కూడా ఉంటారు’ అని టీమిండియా ప్లేయర్ ఒకరు వెల్లడించాడు. ఇంగ్లండ్ చేరిన తర్వాత రెండు జట్లు వారం రోజులు ఐసోలేషన్లో ఉంటాయి. ఆ తర్వాతి నుంచి ట్రెయినింగ్లో పాల్గొంటాయి. ఈ టూర్లో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం బోర్డు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ క్రికెటర్తో పాటు ఫ్యామిలీకి కూడా ఇంటి వద్దే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయిస్తోంది. ఆ రిజల్ట్స్ను బట్టి ప్లేయర్లను ముంబైలోని క్వారంటైన్లోకి అనుమతిస్తుంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానెతో పాటు రోహిత్ శర్మకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వీళ్లందరూ ముంబైలోనే ఉంటుండటంతో.. హోమ్ ఐసోలేషన్కు చాన్స్ ఇచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
జూన్ 16 నుంచి పొవార్ ఫస్ట్ అసైన్మెంట్
ఇక విమెన్స్ క్రికెట్ విషయానికొస్తే.. కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్న రమేశ్ పొవార్.. ఫస్ట్ అసైన్మెంట్ జూన్ 16 నుంచి మొదలుకానుంది. మిథాలీ నేతృత్వంలోని టీమిండియా.. హీథర్ నైట్ సారథ్యంలో ఇంగ్లండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్ప్రీత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.