తేజస్వీ చాలా మంచోడు.. అనుభవంతో నేర్చుకుంటాడు

తేజస్వీ చాలా మంచోడు.. అనుభవంతో నేర్చుకుంటాడు

న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. యువ నేత తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలోని మహా గట్బంధన్.. ఎన్డీయేకు గట్టిపోటీని ఇచ్చింది. ఈ ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. రాజకీయాల్లో అనుభవం లేనప్పటికీ తేజస్వీ బాగా రాణించారని చెప్పారు. ‘తేజస్వీ చాలా మంచి అబ్బాయి. కానీ బీహార్‌‌ను నడిపించే సత్తా ఆయనకు ఇంకా రాలేదు. తేజస్వీ యాదవ్ ఆర్జేడీని ముందుకు తీసుకెళ్లగలరు. అయితే పార్టీతోపాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయనకు మరింత అనుభవం కావాలి. ఏళ్లు గడిచే కొద్దీ తేజస్వీ మరింత రాటుదేలుతారు’ అని ఉమా భారతి పేర్కొన్నారు.