కాంగ్రెస్​లోకి తెలకపల్లి ఎంపీపీ

కాంగ్రెస్​లోకి తెలకపల్లి ఎంపీపీ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్  పార్టీకి చెందిన తెలకపల్లి ఎంపీపీ కొమ్ము మధు శనివారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మధు మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అవమానాలు భరించలేక పార్టీ మారానన్నారు.

మండలంలో  ప్రోటోకాల్  పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించే వారని విమర్శించారు. జడ్పీటీసీలు సుమిత్ర, రోహిణి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.