హైదరాబాద్ లో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

హైదరాబాద్ లో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

హైదరాబాద్​, వెలుగు: ఆదివాసీ గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా150వ జయంతి వేడుకలు హైదరాబాద్​లోని గిరిజన మ్యూజియంలో ఘనంగా జరిగాయి. శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బిర్సా ముండా, రాంజీ గోండు, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. 

కార్యక్రమంలో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్​ పోచం, డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక, మ్యూజియం క్యురేటర్ ద్యావనపల్లి సత్యనారాయణ,  ఉద్యోగులు పాల్గొన్నారు.