గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన సీఎం కేసీఆర్‌

గజ్వేల్‌లో నామినేషన్‌ వేసిన సీఎం కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేశారు.  ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి గజ్వేల్ వెళ్లిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా  నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.  

అనంతరం అక్కడి నుంచి కామారెడ్డికి సీఎం బయలుదేరారు.  అక్కడ కూడా సీఎం నామినేషన్  వేయనున్నారు.  ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసగించనున్నారు.  

also read : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ను ఓడిస్తం : పురుషోత్తం రూపాల

మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.