
హైదరాబాద్: విదేశాల్లో చదువుకునేందుకు మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల గడువును రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. అప్లికేషన్ విండో ఇప్పుడు సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ విద్యార్థుల నుంచి 600 పైగా ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కాలర్షిప్కు ఇంజనీరింగ్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లను అభ్యసించే అభ్యర్థులు సంబంధిత కోర్సులలో కనీసం 60 శాతం మార్కులను పొందినట్లు రుజువును సమర్పించాలి. అదనంగా, దరఖాస్తుదారు సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదు.
అర్హత కలిగిన విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్ , దక్షిణ కొరియా వంటి దేశాల్లో విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో https://telanganaepass.cgg.gov.in/ వెబ్సైట్లో సమర్పించవచ్చు.దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్ల మూడు సెట్ల జిరాక్స్ కాపీలను సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో అందించాలి.