సింగరేణి డేను జీతంతో కూడిన సెలవుగా ప్రకటించాలె : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

సింగరేణి డేను జీతంతో కూడిన సెలవుగా ప్రకటించాలె : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23న పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్​చేశారు. ఆదివారం శ్రీరాంపూర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు అహర్నిశలు కష్టపడుతూ సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సాధిస్తున్నారని అన్నారు.

 సంస్థకు వచ్చిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధంలేని కార్యకలాపాలకు, స్కిల్ డెవలప్​మెంట్ కోర్సులు, పండగలు, జాతర్లు, జాబ్​మేళా ఈవెంట్లకు ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఫుట్​బాల్​దిగ్గజం లియోనల్​మెస్సీతో 20 నిమిషాల ఆట కోసం సీఎం రేవంత్​రెడ్డి ఏకంగా రూ.10 కోట్ల సింగరేణి నిధులను ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీబీజీకేఎస్ శ్రీరాంపూర్​ఏరియా వైస్​ప్రెసిడెంట్​బండి రమేశ్, కేంద్ర జాయింట్​సెక్రటరీ పానుగంటి సత్తయ్య,అన్వేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.