పద్మారావునగర్, వెలుగు: క్రీడలు ఒత్తిడిని దూరం చేస్తాయని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అన్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు క్రీడలను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్రైల్వే స్టోర్స్ క్లబ్లోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఎక్సైజ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఉద్యోగులకు చెస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు.
ఆదివారం ముగింపు వేడుకలకు డైరెక్టర్ హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ సురేశ్రాథోడ్, ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్రెడ్డి, ఎస్టీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
