
సికింద్రాబాద్, వెలుగు : హైదరాబాద్, న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ శనివారం రెండున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరే ఈ ట్రైన్టెక్నికల్సమస్య కారణంగా శనివారం ఉదయం 8.30 గంటలకు స్టార్ట్అవుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.