హైదరాబాద్, వెలుగు: స్లాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి యశ్వి జైన్ సత్తా చాటింది. మూడో రోజుల పాటు హోరాహోరీగా సాగిన టోర్నీలో రన్నరప్గా నిలిచింది. బీహార్కు చెందిన శుభమ్ కుమార్ టైటిల్ గెలుచుకున్నాడు.
ఆంధ్రపదేశ్కు చెందిన సాత్విక్ మూడో స్థానం సాధించాడు. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విజేతలకు నగదు ప్రైజ్మనీ, ట్రోఫీలు అందజేశారు. విన్నర్ రూ.1 లక్ష, రన్నరప్ రూ.60 వేలు, సెకండ్ రన్నరప్ రూ.40 వేలు నగదు బహుమతి దక్కించుకున్నట్లు ఆర్గనైజర్, స్లాన్ స్పోర్ట్స్ సీఓఓ నవీన్ నాయక్ తెలిపారు.