హైదరాబాద్, వెలుగు: ఆదాయం కోసం ప్రభుత్వం వరుసగా అప్పులు చేస్తోంది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన బాండ్ల వేలం ద్వారా రూ. 2,461 కోట్లను సమకూర్చుకుంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రతి నెల రూ. 4 వేల కోట్ల అప్పు చేసింది. ఏప్రిల్ లో రూ. 4 వేల కోట్లు, మే లో మరో రూ. 4 వేల కోట్లను బాండ్లు అమ్మి సేకరించింది. దీంతో ఈ పైనాన్షియల్ ఇయర్లో మొత్తం అప్పు రూ. 10,461 కోట్లకు చేరింది. ఆర్బీఐ ఈ నెల చివరన నిర్వహించే బాండ్ల వేలంలో సర్కారు మరో రూ. 3 వేల కోట్లను సేకరించొచ్చని అధికారులు చెప్తున్నారు.
For More News..