
మెడికల్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికోలకు 15 శాతం స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో మెడికో,డెంటల్ స్టూడెంట్స్ కు గౌరవ వేతనం పెరగనుంది. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా 15 శాతం పెంపుతో ఇంటర్న్ లకు నెలకు రూ. 29,792 వేలు అందనుంది. ఇక పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ రూ. 67,032 స్టైఫండ్ అందనుంది. సెకండియర్ లో రూ. 70,757, ఫైనల్ ఇయర్ స్టైఫండ్ రూ. 74,782 గౌరవ వేతనం అందనుంది. ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ రూ. లక్షా 6,461 స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్స్ కు కు కూడా రూ. లక్షా 6,461 లభించనుంది.
►ALSO READ | హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ పార్కులో ఆక్రమణలు తొలగించిన హైడ్రా
మరో వైపు వైద్యారోగ్యశాఖలో డీఎంఈ విభాగంలోని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ,హానరోరియం,మల్టీ టాస్కింగ్ విధానంలో పనిచేస్తోన్న 16 వేల మంది ఉద్యోగుల పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 మార్చి 31 వరకు వీళ్లు విధుల్లో కొనసాగనున్నారు.