
- నీట్, ఎంసెట్ పరీక్షలకు స్పెషల్ కోచింగ్
- ఈ నెల15 నుంచి డిసెంబర్ 31 వరకు ట్రైనింగ్
- జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, క్లాట్ఎగ్జామ్స్కు ప్రిపరేషన్
- మౌలిక సదుపాయాలు, రిపేర్ల కోసం14జూనియర్ కాలేజీలకు రూ. 3.35కోట్లు రిలీజ్
- స్పెషల్గా స్పోర్ట్స్ మెటిరీయల్కోసం రూ.1.40లక్షలు సాంక్షన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్ ఎడ్యుకేషన్పై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్పెట్టింది. కార్పొరేట్ కాలేజీలకే పరిమితమైన జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, లా కోర్స్కు సంబంధించిన కోచింగ్ను గవర్నమెంట్జూనియర్కాలేజీల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్చేసింది. ఇందులో భాగంగా రోజుకు రెండు పీరియడ్స్ చొప్పున ఆయా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు ఆన్లైన్ ద్వారా కోచింగ్ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, రిపేర్ల కోసం స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసింది.
ఇప్పటి నుంచే స్పెషల్క్లాసులకు శ్రీకారం..
కార్పొరేట్కాలేజీల్లో చదివే స్టూడెంట్స్కు దీటుగా గవర్నమెంట్ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్పోటీ పడేలా స్పెషల్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుల స్టూడెంట్స్కు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంట్స్కు న్యాయవిద్యకు సంబంధించిన కామన్ లా అడ్మిషన్స్ టెస్ట్కు అవసరమైన ఆన్లైన్శిక్షణ ఇస్తారు.
ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రోజుకు రెండు పిరియడ్స్ చొప్పున ఈ ఆన్లైన్ క్లాసులను ఫిజిక్స్వాలా కోచింగ్ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్, క్లాట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు సంబంధించి మొదటి నుంచే స్పెషల్క్లాసులను మొదలు పెట్టడం పట్ల స్టూడెంట్స్తో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం
చేస్తున్నారు.
మౌలికక వసతుల కోసం రూ. 3.35కోట్లు రిలీజ్..
జిల్లాలోని 14 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, రిపేర్ల కోసం ప్రభుత్వం రూ. 3.35కోట్లను రిలీజ్ చేసింది. స్పోర్ట్స్మెటీరియల్ కోసం ప్రత్యేకంగా రూ. 1.40 లక్షలను సాంక్షన్ చేసింది. కాలేజీ మెయిన్టెనెన్స్ కోసం రూ.3.16లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో కాలేజీలో మౌలిక సదుపాయాలు, మైనర్ రిపేర్ల కోసం వినియోగించనున్నారు.
కాలేజీల వారీగా సాంక్షన్ అయిన నిధులు
కాలేజీ ఫండ్స్
కొత్తగూడెం రూ. 58,50,000
భద్రాచలం రూ. 15,40,000
పాల్వంచ రూ. 13,34,000
మణుగూరు రూ. 16,84,000
అశ్వాపురం రూ. 18,26000
ఇల్లెందు రూ. 37,34,000
అశ్వారావుపేట రూ. 9,41,000
చర్ల రూ. 22,90,000
బూర్గంపహడ్ రూ. 22,76,000
పినపాక రూ. 18,76,000
గుండాల రూ. 14,26,000
టేకులపల్లి రూ. 31,26,000
దుమ్ముగూడెం రూ. 17,34,000
ముల్కలపల్లి రూ. 39,34,000
మొత్తం రూ. 3,35,71,000