
మాంస ఉత్పత్తులకు తెలంగాణ బ్రాండింగ్ ఇస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఢిల్లీలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలను కలిశారు తలసాని. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో మెగా డెయిరీ కోసం సహకారం ఆడిగామన్నారు. రాష్ట్రంలో చేపలు, గొర్రెలు పెంపకంలో చాలా ప్రగతి ఉందని చెప్పారు. రైతు బంధు, బీమా.. రైతు వేదికలు, దళిత బంధు లాంటి అనేక కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తెచ్చారని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ విధంగా ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు తలసాని.