
- ఎస్ఎస్సీలో 57%.. ఇంటర్లో 59% పాస్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇంటర్ లో 59.77% , ఎస్ఎస్సీలో 57.60% మంది పాసయ్యారు. శనివారం టాస్ ఫలితాలను సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జేడీ సోమిరెడ్డి రిలీజ్ చేశారు. రిజల్ట్ ను https://www.telanganaopenschool.org వెబ్ సైట్ లో పెట్టారు. ఎస్ఎస్సీలో 28,547 మంది పరీక్షలు రాయగా, 16,443 మంది పాస్ అయ్యారు. వీరిలో 9,023 మంది అబ్బాయిలు, 7,420 అమ్మాయిలున్నారు. ఇంటర్మీడియెట్ లో 41,051 మంది ఎగ్జామ్స్ రాయగా.. 24,538 మంది ఉత్తీర్ణులయ్యారు.
దీంట్లో 14,479 మంది అబ్బాయిలు ఉండగా.. 10,059 అమ్మాయిలున్నారు. ఎస్ఎస్సీలో అత్యధికంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో 89.89% శాతం మంది పాస్ కాగా, అత్యల్పంగా వికారాబాద్ లో 16.52% మంది పాసయ్యారు. ఇంటర్ లో అత్యధికంగా జనగామలో 82.48%, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 44.79% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 12 నుంచి 18 వరకూ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియకు అవకాశం ఉంది. రీకౌంటింగ్ కు ఇంటర్ స్టూడెంట్లు రూ.400, ఎస్ఎస్సీ స్టూడెంట్లు రూ.350 ఫీజు చెల్లించాలి. రీవెరిఫికేషన్ కు రూ.1200 చెల్లించాలని అధికారులు సూచించారు.