తెలంగాణలో 24 గంటల్లో 493 కేసులు

తెలంగాణలో 24 గంటల్లో 493 కేసులు

భారతదేశంలో కరోనా మరోసారి ఉధృతరూపం దాలుస్తోంది. భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17 వేల 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే నాలుగు వేలకు పైగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో 13మంది మరణించగా 13,029 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. రోజురోజుకు కేసులు అధికమౌతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. మరోసారి నిబంధనలు తీసుకొచ్చింది. గురువారం 494 కేసులు నమోదయితే.. గత 24 గంటల్లో 493 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 219 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 90, 692 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.07 శాతంగా ఉందని, మొత్తం 29 వేల 084 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది. 

జిల్లాల వారీగా కేసులు :-
ఆదిలాబాద్ 00, భద్రాద్రి కొత్తగూడెం 07, హైదరాబాద్ 366, జగిత్యాల 00, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 00, కరీంనగర్ 01, ఖమ్మం 07, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 00, మహబూబాబాద్ 04, మంచిర్యాల 00, మెదక్ 00, మేడ్చల్ మల్కాజ్ గిరి 34, ములుగు 01, నాగర్ కర్నూలు 02, నల్గొండ 00, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 07, పెద్దపల్లి 02, రాజన్న సిరిసిల్ల 01, రంగారెడ్డి 40, సంగారెడ్డి 07, సిద్ధిపేట 00, సూర్యాపేట 01, వికారాబాద్ 02, వనపర్తి 00, వరంగల్ రూరల్ 01, హన్మకొండ 08, యాదాద్రి భువనగరి 02. మొత్తం - 493