- అఖిల్ షెరాన్కు ఒలింపిక్ బెర్త్
బాకు (అజర్బైజాన్) : తెలంగాణ షూటర్ ఇషా సింగ్.. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో మళ్లీ అదరగొట్టింది. ఆదివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఇషా–రిథమ్ సంగ్వాన్–మను భాకర్తో కూడిన ఇండియా త్రయం 1744 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచి గోల్డ్ మెడల్ను గెలుచుకుంది. చైనీస్తైపీ (1743.54), చైనా (1743.52) వరుసగా సిల్వర్, బ్రాంజ్ మెడల్ను సాధించాయి. మెన్స్ 50మీ. రైఫిల్–3 పొజిషన్లో అఖిల్ షెరాన్ బ్రాంజ్ మెడల్ గెలిచాడు.
ఫైనల్లో షెరోన్ 450 పాయింట్లతో మూడో ప్లేస్లో నిలిచాడు. ఫలితంగా 2024 ఒలింపిక్ బెర్త్ను కైవసం చేసుకున్నాడు. షూటింగ్లో ఇండియాకు ఇది ఐదో ఒలింపిక్ బెర్త్ కావడం విశేషం. మెన్స్ రైఫిల్–3 పొజిషన్ టీమ్ ఫైనల్లో అఖిల్–ప్రతాప్ సింగ్–నీరజ్ కుమార్తో కూడిన ఇండియా 1750 పాయింట్లతో గోల్డ్ నెగ్గింది. విమెన్స్ 25 మీటర్ల పిస్టల్లో రిథమ్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఒలింపిక్ బెర్త్ను కొద్దిలో చేజార్చుకుంది.