స్కేటర్ రాధే లోయకు సిల్వర్ మెడల్‌‌‌‌

స్కేటర్ రాధే లోయకు సిల్వర్ మెడల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో  హైదరాబాద్‌‌‌‌కు చెందిన యువ స్కేటర్ రాధే లోయ సిల్వర్ మెడల్‌‌‌‌తో మెరిసింది. రోలర్‌‌‌‌‌‌‌‌ స్కేటింగ్ ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా ఆధ్వర్యంలో చండీగఢ్‌‌‌‌లో జరిగిన ఈ టోర్నీలో రాధే  ఫ్రీ స్టయిల్ స్కేటింగ్ సబ్‌‌‌‌ జూనియర్ (11–14 ఏండ్ల) గర్ల్స్ కేటగిరీలో రెండో స్థానంతో సిల్వర్ సొంతం చేసుకుంది.

కర్నాటకకు చెందిన యశస్వి గోల్డ్, తమిళనాడు స్కేటర్ వైభవి బ్రాంజ్ గెలిచారు. ఎల్బీ స్టేడియంలో జితేంద్ర గుప్తా దగ్గర కోచింగ్‌‌‌‌ తీసుకుంటున్న రాధే గతేడాది బెంగళూరులో జరిగిన నేషనల్ రోలర్‌‌‌‌‌‌‌‌ స్కేటింగ్‌‌‌‌లో గోల్డ్ గెలిచింది.