సోనియా గాంధీకి తెలంగాణ రాష్ర్ట నాయకుడు అద్దంకి దయాకర్ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 9 సూత్రాలు సూచించారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఇవ్వాల్సిన భరోసాపై లేఖ రాశారు.
సోనియాకు రాసిన లేఖలోని పాయింట్స్ ఇవే..
* అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను అక్కున చేర్చుకోవాలని లేఖలో కోరారు.
* కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు, కార్యకర్తల్లో విశ్వాసం కల్పించాలని కోరారు.
* రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇస్తామని మీరే (సోనియాగాంధీ) చెప్పాలి.. ప్రచారం కూడా చేయాలని సూచించారు.
* బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయని, పీసీసీ, సీఎల్పీని గైడ్ చేయాలని లేఖలో కోరారు.
* తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని, ఇదే అంశం గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోనూ పెట్టాలని కోరారు.
* కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
* ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
* టికెట్ల కేటాయింపు విషయంలో నమ్మకం ఉన్న నేతలకే ఇవ్వాలని సూచించారు.