గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతపై..త్వరలో అసెంబ్లీలో బిల్లు

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతపై..త్వరలో అసెంబ్లీలో బిల్లు
  • ఐఏఎస్​ జయేశ్​ రంజన్ ​వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్స్​కు సామాజిక భద్రత కల్పించే  బిల్లును త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో  ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్​ పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని, దీనికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్​ డెవలప్‌‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌‌ఆర్‌‌డీఏ) మద్దతు కోరుతామని ప్రకటించారు. 

పీఎఫ్​ఆర్​డీఏ, కేఫిన్‌‌ టెక్ భాగస్వామ్యంతో హైదరాబాద్​లో నిర్వహించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్) కార్పొరేట్ కాంక్లేవ్‌‌లో ఆయన మాట్లాడారు.  రిటైర్‌‌మెంట్​ ప్లానింగ్ గురించి చర్చించడానికి చాలా మంది ఇష్టపడరని ఆయన అన్నారు.   

తెలంగాణలో ప్రభుత్వ, వ్యవస్థీకృత రంగ ఉద్యోగుల కోసం తగిన పెన్షన్​ ఫ్రేమ్‌‌వర్క్ ఉందని ఆయన పేర్కొన్నారు.  అసంఘటిత రంగంలో ఉన్నవారినీ ఆదుకోవడానికి  తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌ఫారమ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) బిల్లును తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని రంజన్​ వెల్లడించారు.