భద్రాద్రి జిల్లాలో ఉత్కంఠగా కబడ్డీ మ్యాచ్ లు

భద్రాద్రి జిల్లాలో ఉత్కంఠగా కబడ్డీ మ్యాచ్ లు
  • సెమీస్​కు చేరిన తెలంగాణ, యూపీ, హర్యానా టీమ్​లు
  • వర్షం కారణంగా వాయిదా పడ్డ రాజస్థాన్, కర్ణాటక మ్యాచ్​ 

పినపాక, వెలుగు : భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్​లో నిర్వహిస్తున్న 69వ అండర్​-–17 ఎస్జీఎఫ్​బాలుర కబడ్డీ పోటీలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. లీగ్ మ్యాచ్​ల నుంచి  16 టీమ్​లు ఇంటిబాట పట్టగా, మరో 16 టీమ్​లు ప్రీక్వార్టర్ ఫైనల్​కు చేరాయి. ప్రీక్వార్టర్​ ఫైనల్​లో కేరళ టీమ్​తో పోటీపడిన తెలంగాణ టీమ్​తీవ్ర ఉత్కంఠ మధ్య 4 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.  

విద్యాభారతిపై పంజాబ్ 1 పాయింట్, ఆంధ్రప్రదేశ్​పై ఉత్తరప్రదేశ్ 26 పాయింట్స్​, గుజరాత్​పై పుదుచ్ఛేరి 5 పాయింట్స్, మణిపూర్​పై రాజస్థాన్ 18 పాయింట్స్, సీబీఎస్​ఈపై కర్ణాటక 17 పాయింట్స్, హర్యానాపై మధ్యప్రదేశ్ 34 పాయింట్స్​, మహారాష్ట్రపై తమిళనాడు 13 పాయింట్స్​ ఆధిక్యంతో విజయం సాధించి క్వార్టర్​ఫైనల్స్​కు చేరాయి. 

సాయంత్రం నిర్వహించిన నాలుగు క్వార్టర్ ఫైనల్స్​లో పుదుచ్ఛేరిపై ఉత్తరప్రదేశ్​ 24 పాయింట్స్, తమిళనాడుపై హర్యానా 1 పాయింట్, పంజాబ్​పై తెలంగాణ 22 పాయింట్లతో సెమీస్​కు చేరాయి. రాజస్థాన్, కర్ణాటక టీమ్ మధ్య జరుగనున్న క్వార్టర్​ఫైనల్​మ్యాచ్​ వర్షం కారణంగా రేపటికి వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రేపటి సెమీస్​లో తెలంగాణ టీమ్ తో ఉత్తరప్రదేశ్​టీమ్, హర్యానా టీమ్ తో రాజస్థాన్​ లేదా కర్ణాటక టీమ్​ తలపడనున్నాయి.