
వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: అర్హులందరికీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందజేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఐనవోలు రైతువేదికలో 147 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, తహసీల్దార్ విక్రమ్, ఎంపీడీవో నర్మద, పార్టీ మండలాధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు యాకర సాంబయ్య, నాయకులు పాల్గొన్నారు.