జనం వరదల్లో కొట్టుకుపోతున్నా, ఇండ్లు, ఊర్లు మునిగిపోతున్నా దొర గడీ దాటి బయటకు రాడు : వైఎస్ షర్మిల

జనం వరదల్లో కొట్టుకుపోతున్నా, ఇండ్లు, ఊర్లు మునిగిపోతున్నా దొర గడీ దాటి బయటకు రాడు : వైఎస్ షర్మిల

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. భారీ వర్షాలతో గ్రామాలు, ఇండ్లు కూలిపోతున్నా.. జనం వరదల్లో కొట్టుకుపోతున్నా.. కేసీఆర్ మాత్రం గడీ దాటి బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వానలు వెలిసిన తర్వాత చుట్టం చూపుగా గాలి మోటార్లో చక్కర్లు కొడతారని, ఆదుకుంటామని గొప్పలు చెబుతారని వ్యాఖ్యానించారు. గత ఏడాది నుంచి గేట్లు మొరాయించినా కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

https://twitter.com/realyssharmila/status/1684871160344055808