టెక్సాస్ కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి..  

టెక్సాస్ కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి..  

అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో మే 7న ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఓ తెలుగమ్మాయి కూడా ఉన్నట్లు ఎఫ్ బీ ఐ పోలీసులు గుర్తించారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్య(27) రంగారెడ్డి జిల్లా జిల్లా జడ్జి, నర్సిరెడ్డి కుమార్తె. ఆమె అమెరికాలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. 

ఈ క్రమంలో మాల్ కి వెళ్లగా దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐశ్వర్యతో పాటు మరో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.