
సూర్య గ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయంలోకి ప్రవేశం ఉండదని ప్రకటించారు. గ్రహణం కారణంగా నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేశారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్ర నామార్చన సైతం నిర్వహించబోమని అధికారులు ప్రకటించారు. బుధవారం సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఉదయం 10 గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
గ్రహణం కారణంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ను సైతం మూసివేయనున్నారు. రేపు ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. సూర్య గ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం దర్శనం కల్పించనున్నారు.