బీఆర్ఎస్​కు పాత నేతల టెన్షన్​ .. ఓటర్లను కాపాడుకోవడంపైనే పార్టీ ఫోకస్

బీఆర్ఎస్​కు పాత నేతల టెన్షన్​ ..  ఓటర్లను కాపాడుకోవడంపైనే పార్టీ ఫోకస్
  • కారు దిగిన నేతలకు బీజేపీ టికెట్​ 
  • గులాబీ ఓట్లు చీల్చుతారనే ఆందోళన 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాత నేతల్లో టెన్షన్​మొదలైంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు మాజీ బీఆర్ఎస్​ లీడర్లే కావడం ఆ పార్టీకి కంటిమీద నిద్రలేకుండా చేస్తోంది. బీఆర్ఎస్​ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జిల్లా రాజకీయాలకు కొత్తవారు కాగా, బీజేపీలో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ నేతల్లో ఒకరు మాజీ ఎంపీ కాగా, మరొకరు మాజీ ఎమ్మె ల్యే ఉన్నారు. 

దీంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు సంగతి పక్కన పెడితే పార్టీ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే తంటాలు పడుతున్నారు. పార్టీలో గ్రూపు తగాదాలతో క్యాడర్ చల్లాచెదురువుతోంది. ఎంపీ ఎన్నికల తర్వాత లోకల్​బాడీ నోటిఫికేషన్​ వస్తదని ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో బీఆర్ఎస్​ లీడర్లు మెల్లగా జారుకుంటున్నారు. పార్టీ క్యాడర్​జారిపోకుండా మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు కూడా వర్క్​వుట్ కావట్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ వార్​తమకు కలిసి వస్తుందని నమ్ముకుని మాజీ ఎమ్మెల్యేలు బోల్తాపడ్డారు. ఇప్పుడు కూడా అదే సీన్​రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు. 

పార్టీ ఓటర్ల పైనే ఫోకస్..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోయారు. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి మాత్రం స్వల్ప ఓట్లతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను కాపాడుకోవడంపైనే పార్టీ ఫోకస్​పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీకి ఆదరణ పెరిగిందని బీఆర్ఎస్​ అంతర్గత మీటింగ్​లో చర్చ నడుస్తోంది. దీంతోనే కేటీఆర్, హరీశ్​రావు సైతం బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేస్తున్నారు. కానీ, జిల్లాలో మాత్రం కాంగ్రెస్​ లీడర్లు, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా పైకి కనిపించే తతంగం తప్ప.. లోపల మా త్రం బీజేపీ భయం వెంటాడుతోంది. 

ఇద్దరు క్యాండిడేట్లు బీఆర్ఎస్​ నుంచి వలసపోయిన వాళ్లే కావడంతో తమ పార్టీ ఓటర్లు బీజేపీ వైపు టర్న్​అవుతురేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే భువనగిరిలో బీజేపీకి కౌంటర్​గా బీఆర్ఎస్​సైతం బీసీ క్యాండిడేట్​ను బరిలో దింపింది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ పైనే బీసీ సెంటిమెంట్​బలంగా పనిచేస్తుందని బీఆర్ఎస్​ లీడర్లే బయటకు చెబుతున్నారు. గౌడ ఓటర్లు బలంగా ఉండటం  ఒక ఎంతైతే.. క్యామ మల్లేశ్​జిల్లాకు కొత్త కావడం మైనస్​ అని భావిస్తున్నారు. 

నాడు బీజేపీ ‘ట్రైయాంగిల్’​ ఎత్తులు పారలే.. 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై బీఆర్ఎస్​ నమ్మకం పెట్టుకుంది. జిల్లాలో ముక్కోణపు పోటీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ వ్యతిరేకత ఓటు చీలిపోతే బీఆర్ఎస్​కే కలిసి వస్తుందని చాలా మంది ఎమ్మెల్యేలు భావించారు. ముఖ్యంగా సూర్యాపేట, ఆలేరు, తుంగతుర్తి, నల్గొండ, భువనగిరి, మునుగోడు, దేవరకొండపై బీఆర్ఎస్​ ఆశలు పెట్టుకుంది. బీజేపీ అభ్యర్థులు తీరా ఎన్నికల టైంలో సైలెంటయ్యారు. 

దీంతో బీజేపీకి ఎక్కడ కూడా డిపాజిట్​దక్కలేదు. ఈ తరహా ఆపరేషన్​ ఒక్క సూర్యాపేటలో మాత్రమే సక్సెస్​అయ్యింది. 40 వేలకు పైగా ఓట్లు బీజేపీకి రావడంతో కాంగ్రెస్​ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్​అయ్యింది. బీజే పీ బలపడిందని బీఆర్ఎస్ లీడర్లే ఒప్పుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్​ను దెబ్బ తీయడం సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్​ ఓటర్లు బీజేపీ వైపు చీలిపోకుండా కా పాడుకునేందుకే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.