
- యశోద దవాఖాన ఎదుట ఆందోళన
- హాస్పిటల్ అద్దాలు ధ్వంసం
- డబ్బులు కట్టించుకున్నాకచనిపోయాడని చెప్పారంటూ ఫైర్
హైదరాబాద్ సిటీ, వెలుగు : సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో హార్జ్సర్జరీ చేయించుకున్న వ్యక్తి కొద్దిసేపటికే చనిపోవడంతో, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులు ఆగ్రహానికి గురై హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..
వెంగళ్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల మూడో తేదీన గుండె సంబంధిత సమస్యతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరగా, ఐదో తారీఖున ఆపరేషన్ చేశారు. సర్జరీ తర్వాత ఆపరేషన్సక్సెస్అయ్యిందని, పెండింగ్డబ్బులు కట్టించుకున్నారు. గంట సేపటికే వెంగళ్రెడ్డి చనిపోయాడని బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు.
సర్జరీ బాగానే జరిగిందని చెప్పారని, అంతలోనే ఎలా చనిపోతాడని హాస్పిటల్ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఒక దశలో హాస్పిటల్అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులతో మాట్లాడి సర్ధి చెప్పి పంపిచారు.