హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజుల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం రిలీజ్ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.50 ఫైన్తో నవంబర్ 15- 25 వరకు, రూ.200 ఫైన్తో నవంబర్ 29 - డిసెంబర్ 12 వరకు, రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 15 -నుంచి 29 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని ప్రకటించారు. ఇదే షెడ్యూల్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ రాయబోయే విద్యార్థులకూ వర్తించనున్నదని చెప్పారు.
