
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తింది. మోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయని.. కశ్మీర్ నాశనమైందని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఈ సందర్భంగా అన్నారు. ఆపరేష్ సిందూర్ పై కేంద్ర ప్రభుత్వం నిజాలు దాస్తోందని.. నిజాలు చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. .
ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఇచ్చామని.. కానీ సీజ్ ఫైర్ కు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో PoK ను ఆక్రమించుకునే ఛాన్స్ కోల్పోయామని అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలు:
- ఆపరేషన్ సిందూర్ పై చర్చను రక్షణ మంత్రి పక్కదారి పట్టిస్తున్నారు
- మోదీ పాలనలో జమ్మూ కశ్మీర్ నాశనమైంది
- కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు
- ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ సురక్షితం అని చెప్పారు
- కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు
- ఆపరేషన్ సిందూర్ పై ప్రభుత్వానికి సంపూర్ణ మద్ధతిచ్చాం
- మోదీ సర్కార్ ఎందుకు సీజ్ ఫైర్ కు ఒప్పుకుంది
- వంద రోజులైనా ఎందుకు స్పందించలేదు
- ఉగ్రవాదులు దాడి తర్వాత ఎలా పారిపోయారు
- పహల్గాం ఉగ్రదాడి తర్వాత సౌదీ నుంచి వచ్చిన మోదీ బీహార్ వెళ్లారు
- మోదీకి దేశ రక్షణ కంటే పాలిటిక్స్ ముఖ్యం
- 2016 తర్వాత ఉగ్రదాడులు ఉండవని చెప్పారు
- మోదీ అసమర్థ పాలనతోనే ఉగ్రదాడులు పెరిగాయి
- భారత జెట్స్ కూలాయని సింగపూర్ లో సీడీఎస్ (చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్) ఒప్పుకున్నారు
- షంగ్రిలా డైలాగ్ పై సీడీఎస్ చెప్పిన మాటలు నిజం కావా..?
- ఒక్కో జెట్ కోట్లు ఖర్చు చేశాం
- విదేశాంగ విధానం పూర్తిగా అట్టర్ ఫ్లాప్
- ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం నిజాలు దాస్తోంది
- ఆపరేషన్ సిందూర్ పై మోదీ ప్రభుత్వం నిజాలు చెప్పాలి
- ఆపరేషన్ సిందూర్ పై నిజాలు చెప్పేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం
- కేంద్ర ప్రభుత్వానికి అహంకారం పెరిగిపోయింది
- ఎంత పెద్ద తప్పు జరిగినా ఏం జరగలేదన్నట్లు బుకాయిస్తోంది.
- PoK ను స్వాధీనం చేసుకునే మంచి అవకాశం కోల్పోయాం
- మోదీ పాలనలో త్రిఫ్రంట్ యుద్ధానికి పునాదులు
- బంగ్లాదేశ్ తో బంధం పూర్తిగా దెబ్బతింది
- పాక్ కు ఐఎంఫ్ సాయం ఆపడంలో భారత్ విఫలం
- ఏడీబీ, ప్రపంచ బ్యాంకునుంచి పాక్ కు నిధులు వెళ్తూనే ఉన్నాయి