నీరు వృధా..ఇంటి యజమానికి GHMC రూ. లక్ష ఫైన్  

నీరు వృధా..ఇంటి యజమానికి GHMC రూ. లక్ష ఫైన్  

హైదరాబాద్ : నీరు వృధా చేసిన ఓ ఇంటి యజమానికి GHMC అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రోడ్డు మీదకు వెళ్ళేలా నీటిని వదిలి, నిర్లక్యంగా వ్యవహరించిన యజమానికి భారీ జరిమానా వేశారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్ యజమాని … తమ సెల్లార్‌ లోకి చేరిన నీటిని మోటర్ సర్వీస్ ద్వారా రోడ్డుపైకి వదలాడు. ఈ క్రమంలో… ఆ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ కు అధికారులు రూ. లక్ష ఫైన్ వేశారు.

గతంలో కూడా ఆ అపార్ట్ మెంట్ యజమాని ఇదే మాదిరిగా నిర్లక్యంగా వ్యవహరించాడని తెలిపారు GHMC అధికారులు. అయితే… ఇలాగే… ఎన్ని సార్లు చెప్పినా ఆ యజమాని  వినిపించుకోకుండా నీటిని రోడ్డుపైకే వదులుతుండడంతో.. ట్రాఫిక్ జామ్ అవుతుండడం, బైకులు స్కిడ్ అయి పడిపోతుండడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో… సీరియస్ అయిన జోనల్ కమీషనర్ రవికిరణ్ ఆ భవన యజమానికి రూ. లక్ష జరిమానా వేశారు.