కోహ్లీది అభిప్రాయమే.. డిమాండ్​ కాదు

కోహ్లీది అభిప్రాయమే.. డిమాండ్​ కాదు

లండన్: వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ (డబ్ల్యూటీసీ) ఫైనల్​.. బెస్టాఫ్​ త్రీగా ఉండాలన్నది కోహ్లీ అభిప్రాయం మాత్రమేనని టీమిండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ అన్నాడు. ఫార్మాట్​ను ఛేంజ్​ చేయాలని తను ఎప్పుడూ డిమాండ్​ చేయలేదన్నాడు. అయితే కొంత మంది విశ్లేషకులు విరాట్​వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. ‘బెస్టాఫ్​ త్రీ ఉంటే బెస్ట్​ టీమ్​ను సెలెక్ట్​ చేయొచ్చన్నది కోహ్లీ అభిప్రాయం. మూడు మ్యాచ్​లు ఉండటం ద్వారా కండీషన్స్​కు అలవాటు పడటంతో పాటు పుంజుకోవడానికి చాన్స్​ ఉంటుందని చెప్పాడు. అంతేగానీ బెస్టాఫ్​ త్రీ ఉండాలని తను డిమాండ్​ చేయలేదు’ అని అశ్విన్​ పేర్కొన్నాడు. ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​కు ఇంకా టైమ్​ ఉండటంతో.. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు బ్రేక్​ ఇచ్చారు. ఇలాంటి బ్రేక్ ప్లేయర్లకు చాలా మంచిదని అశ్విన్​ అభిప్రాయపడ్డాడు. ‘మేం చాలా రోజుల నుంచి బబుల్​లోనే గడుపుతున్నాం. ఇప్పుడే కొద్దిగా బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం. ఇలాంటి బ్రేక్​ మాకు చాలా అవసరం. ఎందుకంటే దీనివల్ల ప్లేయర్లందరూ మళ్లీ ఉత్సాహంగా తయారవుతారు. ఫలితంగా మంచి క్రికెట్​ ఆడే చాన్స్​ లభిస్తుంది’ అని రవిచంద్రన్​ వ్యాఖ్యానించాడు.