
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. లొంగిపో లేదంటే చంపేస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఏ మాత్రం లెక్క చేయలేదు. బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్ బెదిరింపులను లైట్ తీసుకున్న ఖమేనీ.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ చేశారు. యుద్ధం ప్రారంభమైందని.. ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకు బలమైన ప్రతిస్పందన ఇస్తామని. యూదు టెర్రరిస్టులపై కనికరం చూపం’’ అని ఖమేనీ ట్వీట్ చేశారు.
ట్రంప్ వార్నింగ్ను కనీసం పట్టించుకోకుండా యుద్ధం మొదలైందంటూ ఖమేనీ ట్వీట్ చేయడంతో పశ్చిమాసియా భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఏ క్షణాన ఏం జరుగుతోంది అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం బాంబులు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని కార్యక్రమ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండగా.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ తో పాటు ఆ దేశంలోని కీలక ప్రాంతాలపై ఇరాన్ ఎటాక్ చేస్తోంది. ఇరు దేశాల దాడిలో రెండు వైపుల చాలా మంది చనిపోయారు.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్తో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే టెహ్రాన్ నామారూపాలు లేకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి కూడా ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. సో కాల్డ్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లొంగిపోవాలి.. నువ్వెక్కడ దాక్కున్నావో మాకు తెలుసు.. నిన్ను చంపడం మాకు పెద్ద విషయం కాదు.. కానీ అది ఇప్పుడే కాదు అంటూ హెచ్చరించాడు. ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఖమేనీ లైట్ తీసుకున్నారు.
ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా యుద్ధం స్టార్ట్ అంటూ కౌంటర్ ఇవ్వడంతో అమెరికా ఏం చేస్తోందోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కీలకమైన అపరేషన్ల సందర్భంగా మీటింగ్ నిర్వహించే సిట్యుయేషన్ రూమ్ కు ట్రంప్ వెళ్లారు. ముఖ్యమైన జీ7 మీటింగ్ నుంచి ఉన్నఫలంగా సిట్యుయేషన్ రూమ్ కు ట్రంప్ వెళ్లడంతో ప్రపంచం ఊహించనిదేదో అమెరికా చేయబోతుందని ప్రపంచదేశాల్లో చర్చ మొదలైంది. ట్రంప్ హెచ్చరికను బేఖాతారు చేసిన ఇరాన్ పై యూఎస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరీ.