నేరేడ్మేట్ బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం

నేరేడ్మేట్ బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం

మేడ్చల్ జిల్లా నేరెడ్ మెట్  కాకతీయ నగర్ కు  చెందిన చిన్నారి  సుమేధ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. బండ చెరువులో బాలిక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. గురువారం సాయంత్రం సైకిల్ పై బాలిక ఇంటి నుంచి బయటకి వెళ్లింది. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో దీన్ దయాల్ కాలనీలో నాలాలో పడింది సుమేధ. నిన్న సాయంత్రం సుమేధ  సైకిల్ పై  బయటకు వెళ్లింది. నాలాలో  ఆమె  సైకిల్  బయటపడింది. బాలిక నాలాలో  పడిపోయిందని పోలీసులు అనుమానించారు.  దీంతో నాలాలో  వెతికారు. చివరికి  బండ చెరువులో బాలిక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు

ప్రమాదానికి GHMC నిర్లక్ష్యమే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. GHMC కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి ఏడింటికి ఫోన్ చేస్తే ఇవాళ ఉదయం GHMC సిబ్బంది వచ్చారని చెప్తున్నారు. GHMC సిబ్బంది సమయానికి స్పందించి  ఉంటే… ఈ ఘోరం జరిగుండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్

కరోనా వారియర్స్ ను ఎందుకు అవమానిస్తున్నారు?

హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం