మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై కేంద్రాన్ని కోరాం

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై కేంద్రాన్ని కోరాం

23 రకాల నిత్యావసర వస్తువులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మత్స్య, పౌల్ట్రీ  ఉత్పత్తులను MSP పరిధిలోకి తీసుకురావాలని కోరామన్నారు. కులగణన చేయాలని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.