మునగ గ్లోబల్ మార్కెట్రూ.63 వేల కోట్లు
మన ఎగుమతులు పెంచుకునే ఛాన్స్
వెలుగు బిజినెస్ డెస్క్:ఎన్నో పుష్కలమైన మెడిసినల్ వాల్యూస్ ఉండే మునగ గ్లోబల్ మార్కెట్ సైజు 7 .7 బిలియన్ డాలర్ల (రూ.63 వేల కోట్ల) దాకా ఉంటుందని అంచనా. ఇటీవలి నెలల్లో మన దేశపు ఎగుమతులు కొద్దిగా తగ్గడంతో ప్రభుత్వం ఇప్పుడు ఎగుమతులు పెంచుకోవడంపై ఫోకస్ పెడుతోంది. ఇందుకు అనుకూలమైన స్పెషల్ ప్రొడక్ట్స్ను గుర్తించే ప్రయత్నంలో ఉంది. అలాంటి ప్రొడక్ట్స్లో మునగ ఒకటిగా చెప్పుకోవచ్చు. మునగ (డ్రమ్స్టిక్స్) ఆకులలో ప్రొటీన్స్ ఎక్కువ. ఏ, బీ, సీ విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాదు, వాటిలో కొన్ని మినరల్స్ఉన్నాయి. మునగ లేదా మునగ ప్రొడక్ట్స్లో యాంటిబయాటిక్, హైపోటెన్సివ్, యాంటిస్పాస్మాడిక్, యాంటిఅల్సర్, యాంటి ఇన్ఫ్లమేటరీ , హైపోగ్లైసిమిక్ లక్షణాలుంటాయని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) చెబుతోంది. ఇన్ఫ్లమేషన్, గాల్బ్లాడర్, కిడ్నీ ఇన్ఫెక్షన్, డయాబెటిస్ వంటి వాటిని నయం చేయడానికి మునగ ప్రొడక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. మునగపై 20 ఏళ్లు రీసెర్చ్ చేసిన కాలిఫోర్నియా యూనివర్శిటీ రీసెర్చర్ ఈ విషయాలు వెల్లడించారు. మన దేశంలో చాలా వ్యాధుల చికిత్సకు మునగను వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు.
గిరాకీ పెరుగుతోంది!
మునగ ప్రొడక్ట్స్కు ప్రధానంగా అమెరికా, జర్మనీ, కెనడా, చైనా, సౌత్ కొరియా దేశాలలో బాగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి మునగ ఎగుమతులు పెంచుకోవడానికి మెరుగైన అవకాశం ఉంది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపెడా) రిపోర్టు ప్రకారం మన దేశంలో ఏటా 2.2 మిలియన్ టన్నుల మునగ కాయలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఆర్గానిక్ మునగ కూడా..!
ఎగుమతులు పెరగడానికి మునగతో ఛాన్స్లు ఎక్కువేనని చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత గుర్తించిన సూపర్ ఫుడ్స్లో మునగ కూడా ఒకటి. ఇటీవలి సంవత్సరాలలో కొంత మంది వ్యాపారులు మునగపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు తెలంగాణలోని మేడికొండ న్యూట్రియెంట్స్ 2020 డిసెంబర్లో 2 టన్నుల ఆర్గానిక్ మూరింగ (మునగ) పౌడర్ను అమెరికాకు ఎగుమతి చేసింది. 2019లో మొత్తం 530 టన్నుల మూరింగ ప్రొడక్ట్స్ను ఎగుమతి చేశామని మేడికొండ న్యూట్రియెంట్స్ సీఈఓ అమర్ మేడికొండ చెప్పారు. 2020–21లో రూ. 20 కోట్లు, 2021–22లో రూ. 15 కోట్ల విలువైన మూరింగ ప్రొడక్ట్స్ ఎగుమతి అయినట్లు ఎపెడా ప్రతినిధి వెల్లడించారు. 2019–20 లో దేశం నుంచి 480 టన్నుల మూరింగ లీఫ్ పౌడర్, 49 టన్నుల మూరింగ డ్రూ లీవ్స్, 11 టన్నుల మూరింగ ఆయిల్ ఎగుమతి అయినట్లు అమర్ మేడికొండ పేర్కొన్నారు. 2018 నుంచి ఢిల్లీ కంపెనీ టెర్రీ ఎక్స్పోర్ట్స్ కూడా మూరింగ ప్రొడక్ట్స్ను ఎగుమతి చేస్తోంది. కోయంబత్తూర్లో కాంట్రాక్టు బేసిస్ మీద ఈ కంపెనీ మూరింగ సాగు చేస్తోంది. గల్ఫ్, దక్షిణ అమెరికాల నుంచి కూడా ఇప్పుడు ఆసక్తి కనబడుతోందని, ముఖ్యంగా మూరింగ సీడ్స్ కోసం అడుగుతున్నారని, ఇమ్యూనిటీని పెంచే మునగ, అశ్వగంధ, పసుపు వంటి వాటికి డిమాండ్ ఉందని టెర్రీ ఎక్స్పోర్ట్స్ ఎండీ దీపాంకర్ వర్మ చెప్పారు.