దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు నాలుగు లక్షలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 29 వేల 942 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 29 లక్షల 92 వేల 517 మందికి పెరిగింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 3 వేల 876 మంది కరోనా కారణంగా చనిపోగా..మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 49 వేల992కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 3 లక్షల 56 వేల 82 మంది డిశ్చార్జ్ కాగా...ఇప్పటివరకూ కోటి 90 లక్షల 27 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 37 లక్షల 15 వేల యాక్టివ్ కేసులున్నాయి.
India reports 3,29,942 new #COVID19 cases, 3,56,082 discharges and 3,876 deaths in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) May 11, 2021
Total cases: 2,29,92,517
Total discharges: 1,90,27,304
Death toll: 2,49,992
Active cases: 37,15,221
Total vaccination: 17,27,10,066 pic.twitter.com/tYoQlB5hQx