రెండున్నర లక్షలకు చేరిన కరోనా మృతులు

రెండున్నర  లక్షలకు చేరిన కరోనా మృతులు

దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు నాలుగు లక్షలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 29 వేల 942 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 29 లక్షల 92 వేల 517 మందికి పెరిగింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 3 వేల 876 మంది కరోనా కారణంగా చనిపోగా..మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 49 వేల992కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 3 లక్షల 56 వేల 82 మంది డిశ్చార్జ్ కాగా...ఇప్పటివరకూ కోటి 90 లక్షల 27 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 37 లక్షల 15 వేల  యాక్టివ్ కేసులున్నాయి.